Thursday, 14 November 2024
మంత్రి నారా లోకేష్ గారిని కలిసిన జెఎసి నాయకులు
పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు (ఐవి) ఆధ్వర్యంలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసిన జెఎసి రాష్ట్ర నాయకత్వం.. సమ్మె కాలపు జీతం విడుదల పై మంత్రిగారికి ధన్యవాదాలు తెలిపారు. హెచ్.ఆర్ పాలసీ వర్తింప చేయాలని, మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలుచేయాలని, ఇతర విషయాలు పైన వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెఎసి గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర చైర్మన్ కాంతారావు నాని, జనరల్ సెక్రటరీ కల్యాణి, ఆర్గనైజేషన్ సెక్రటరీ జాన్ మోడీ, కో-చైర్మన్లు డా.బోమ్మిడి నాగరాజు, మహమ్మద్ రఫీ, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాస్, ఏలూరు జిల్లా నాయకులు బాలాజీ, బాపట్ల జిల్లా నాయకులు వీరాంజనేయులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment