Friday, 5 July 2024
date 05.07.2024 జేఏసీ సెక్రటరీ జనరల్ యు.కళ్యాణి , వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రవీంద్ర బాబు నాయకత్వంలో జెఎసి ప్రతినిధి బృందం ఈరోజు గౌరవ విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారిని కలిసి పెండింగ్ వేతనాలు, సమ్మె కాలం జీతం, ఇతర సమస్యల పైన వినతి పత్రం ఇచ్చారు.**👉అనంతరం సెక్రటేరియట్ లో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ గారిని, అసిస్టెంట్ డైరెక్టర్ గారిని కలిసి సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీతాలకు సంబంధించి బడ్జెట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు.**👉 గౌరవ మంత్రి శ్రీ నిమ్మల రాము నాయుడు గారిని కలిసి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పైన వినతిపత్రం ఇచ్చారు.. సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.**👉 సాయంత్రం గౌరవ ఎస్పిడి గారిని కలిసి పెండింగ్ వేతనాలు, సమ్మెకాలపు జీతం చెల్లింపు పై వినతిపత్రం ఇచ్చారు..బడ్జెట్ త్వరగా రావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీడీగా తెలియజేశారు. సమ్మె కాలం జీతం, సమ్మె అగ్రిమెంట్ మినిట్స్ లో ఉండే అంశాలను పై గౌరవ మంత్రి గారితో చర్చించి పది రోజుల్లో పరిష్కారం చేస్తామని గౌరవ SPD గారు తెలియజేశారు.**👉 సమగ్ర శిక్షా స్టేట్ ఫైనాన్స్ కంట్రోల్ ఆఫీసర్ గారిని కలిసి జీతాలు బడ్జెట్ విడుదల చేయుటకు చొరవ తీసుకోవాలని కోరారు.**ఈ టీంలో ఈ ముగ్గురితోపాటు, రాజమండ్రి జేఏసీ నాయకులు రామ్మోహన్, ఏలూరు జిల్లా జెఎసి నాయకులు బాలాజీ, ప్రకాశం జిల్లా నాయకులు కిరణ్, వెంకటేష్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఉన్నారు.ఈ విషయాన్ని మన సభ్యులందరికీ తెలియజేయండి.*💐💐💐*-కాంతారావు నాని**రాష్ట్ర చైర్మన్*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment